"తెలుగు :::::::::::::
,,,,,,
" తెలుగదేల అన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ ! తెలుగొకండ! :::
ఎల్ల నృపులు కొలువ ఎరుగ,నే బాసాడి :::
దేశ భాషలందు తెలుగు లెస్స! "
:::::::::::::::::::::::::::::::::::::::::
ఈ అమూల్య పద్య రాజము ,
"ఆముక్త మాల్యద " అనే ప్రబంధమును రచియించిన
"శ్రీ కృష్ణ దేవ రాయలు " నుడివినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,
సామాన్య ప్రజలే కాక,
ఎందరో ప్రభువులు,రాజులు, చక్రవర్తులు,
మంత్రులు ,సేనాపతులు,,అధికారులు కూడా స్వయంగా ఉద్గ్రంధాలను రచించారు.
ముద్రణా సదుపాయములు లేని రోజులలో,
ఘంటమును చేత బూని ,ఎన్నో గొప్ప రచనలను మనకు అందించారు.
ఈ చారిత్రక అద్భుత సంఘటనములు, కేవలం మన దేశములోనే జరిగినవి " అని మనమందరమూ ఘంటా పథంగా ,సగర్వంగా ,దశ దిశలా ఎలుగెత్తి చెప్ప గలము.
'గిన్నీస్ రికార్డులలో 'స్థానము 'దక్కించుకో గలిగిన అంశము ఇది !,ఔనా!!!'
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: ప్రాచీన రత్న మాల