పోతన పద్యము :::
,,,,,,,,,,,,,,,,,,
సీసము://
"ఏ బాము లెరుగక యేపారు మేటికి :
  పసుల కాపరి ఇంట బాము కలిగె:
 నే కర్మములు లేక యెనయు నెక్కటికి :::
         జాత కర్మంబులు సంభవించె :
 నే తల్లి చను బాలు నెరుగని ప్రోఢ:
  యశొద చను బాల చొరవ   నెరిగె:  
 నే హాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు :
    పొదిగిటిలో వృద్ధి పొంద జొచ్చె :::
ఆట //
  నే తపములనేని నెలమి పండని పంట :
  వల్లవీ జనముల వాడ పండె :
  నే చదువులనైన నిట్టిట్టి దన రాని :
  అర్ధ మవయవముల నందమొందె! "
...................................
కష్టమే ఎరుగని శ్రీ కృష్ణునికి 
  పసుల కాపరి ఇంట సంక్లిష్టతలను అనుభవించ వలసి వచ్చినది.   
 కర్మలే అంటని దైవమునకు ,జాతక కర్మలు జరగాల్సి వచ్చినది.  
 యశోద చను పాలను కుడువ వలసి వచ్చెను.
   హాని,వృద్ధులు తెలియని బ్రహ్మము,
    తల్లి ఒడిలోన పెరుగ వలసెను.
   ఎట్టి తపస్సులకును సాధ్య మవని
       కన్నుల పంటలు  ,వ్రజ వాసులకు దక్కినది.
    ఎలాంటి చదువుల ద్వారానైనా
         " ఇలాంటిదీ" అనివర్ణించ లేని అర్ధము 
            క్రమముగా వృద్ధి నొందుచున్న అవయవముల 
              అంద చందములు అలరారు వాడు అయ్యెను .  "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లేబుళ్లు: ప్రాచీన రత్న మాల
