పోతన,నవమ స్కంధము ,250 వ పద్యము

యజ్ఞ శాలలో కుశీ లవులు " రామ కథా గానము "చేసిరి. ఆ పాట మాధుర్య ప్రవాహమున ఎండిన చెట్లు చిగురించునట్లుగా సాగెను. ఆ గానము
శ్రీ రామచంద్రుని,ప్రజలను ఆనందములో ఓలలాడించసాగెను.కుశీ లవ కుమారులపై ఎల్లరకు వాత్సల్య ,అనురాగములు జనియించగా వారి కన్నుల నుండి ఆనంద బాష్పములు కార
సాగెను.
(పోతన,నవమ స్కంధము ,250 వ పద్యము)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

" వట్టి మాకులు పల్లవింప ,నవారియై మధు ధార దా :
నుట్ట పాడిన ,వారి పాటకు నుర్వరాధిపుడున్,ప్రజల్ :
బిట్టు సంతస మంది రయ్యెడ, ప్రీతి కన్నుల బాష్పముల్ :
దొట్ట నౌదల లూచి ,వారల తోడి మక్కువ పుట్టగాన్. "

(పోతన) :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment