పోతన పద్యము :(903)

పోతన పద్యము :(903)
,,,,,,,,,,,,,,
లలితాయతాష్ట భుజ మం :::
డల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీ :::
లలనా కాంతి స్ఫర్ధా :
కలిత లసద్ వైజయంతికా శోభితుడున్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మేరు పర్వ శిఖరము వంటి నీల దేహముతో ,
నీల మేఘ ఛాయ కల స్వామి ,గరుడ వాహనుడు వచ్చెను.
కమనీయమైన దేహ కాంతితో దిక్కుల చీకట్లను విచ్ఛిన్నము చేసెను.
ఎనిమిది ఆయుధములు ధరించి,
ముని జన పరివేష్టితుడైన నరాయణుడు,
మెరిసే చెవుల కుండలముల కాంతులు చెక్కిళ్ళ మీద ప్రతి ఫలించ సాగెను.
నవ రత్నములు తాపడము చేసిన కిరీటమును,
వక్ష స్థలమున కౌస్తుభమును,పచ్చని పట్టు పీతాంబరములతో ,భాసిల్లుచుండెను.
నారాయణ మూర్తి హారములను, బాహు పురులను ,
కంకణములను, ఘల్లు టందెలను ధరించెను.
(903)
మనోహరమైన ఎనిమిది బాహువుల నడుమ వక్ష స్థలమునందున :శ్రీ లక్ష్మీ దేవి ప్రకాశించు చున్నది. ఆమె కాంతులతో స్పర్ధ వహించుచూ "వైజయంతీ మాల " తళుకులీనుచున్నది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

0 Comments:

Post a Comment