నవ రాత్రి

విజయ వాడ లో ,ఇంద్ర కీలాద్రి పైన కొలువు ఐ ఉన్న
"శ్రీ కనక దుర్గా మాత "కు
కోటి వందనములు.
౧. . శ్రీ కనక దుర్గా దేవి ...... స్వర్ణ కవచాలంకృత
బంగారు ఆభరణములతో ఆలంకరణ లు చేస్తారు.
౨. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి , బాల కన్యక గా .................. అభయ వరదములతో అలంకరించ బడును.
౩. శ్రీ గాయ త్రి దేవి ............ ముక్త, విద్రుమ,హేమ ,నీల , ధవళముఖములతో అలంకరిస్తారు.
౪.శ్రీ అన్నా పూర్ణా దేవి.............. చేతిలో అన్నముగిన్నె తోను, పార్శ్వ భాగమునందు ,
ఎడమ వైపు పరమేశునితో కొలువు తీరి ,ఉన్నారు.
౫. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి .............. చేతిలో చెరకు గడ పట్టి, శ్రీ లక్ష్మి దేవి, శ్రీ సరస్వతి దేవి లు ఇరు వైపుల
చరణముల వద్ద శంకరుడు కొలువై ఉన్న అద్భుత దృశ్యము ఇది.
౬. శ్రీ మహా లక్ష్మీ దేవి .................................... అభయ ,వరద హస్తములతో అనుగ్రహించు తల్లి .
౭. శ్రీ సరస్వతి దేవి .......................................... చదువుల తల్లి ఈమె,తెల్లని చీరను కట్టి, వీణాధారిణిఐ ,మయూరి తో
అనగా , నెమలి తో ను , వీణ తోను ప్రత్యక్షము అగును.
౮. మహిషాసుర మర్దని .......................... త్రి శూల ధారిణి,ఒక చేతిలో రాక్షసుని తలతో, ఉగ్ర రూపిణి గా అవతరించెను.
మహిషాసుర మర్దనిని శాంతింప జేయుటకై, భక్త కోటి,పూజలను చేస్తారు.
ప్రజల భక్తికి , సంతోషించిన " అమ్మ వారు "
" శ్రీ రాజ రాజేశ్వరి దేవి"గా అవతరిస్తున్నది.
హస్తమునందు చెరకు గడతో , ప్రశాంత మూర్తి గా భాసిల్లుతూ ,
శ్రీ కనక దుర్గా మాత ఎల్ల జగత్తుకు కన్నతల్లి , వర ప్రదాయిని, ఆనంద దాయిని .

0 Comments:

Post a Comment